సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
ఖానాపూర్లో కాంగ్రెస్ నాయకుల ఇంటింటా ప్రచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుపటేల్ ఆదేశాల మేరకు గురువారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా మాజీ జెడ్పి కోఆప్షన్ మెంబర్ యూసఫ్ ఖాన్ ఆధ్వర్యంలో 8వ వార్డులో ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ మైనార్టీ అధ్యక్షులు షౌకత్ పాషా, మాజీ ఏఎంసీ చైర్మన్ కడార్ల గంగ నరసయ్య, సీనియర్ నాయకులు మడిగెల గంగాధర్, మాజీ సర్పంచ్ నేరెళ్ల సత్యనారాయణ, మాజీ నీటి సంఘం చైర్మన్ మదిరి సత్యనారాయణ, నాయకులు.ముషీర్. బి రాజేందర్, అజీజ్. కలీం. వార్డు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.