సిరా న్యూస్,మచిలీపట్నం;
జిల్లా ఖజానా కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ ప్రసాద ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడ్డాడు. నాలుగు నెలల జీతం బిల్లు శాంక్షన్ చేయడానికి మచిలీపట్నం మున్సిపల్ ఉద్యోగి షాజహాను రూ.10వేలు అసిస్టెంట్ ప్రసాద్ డిమాండ్ చేసారు. గతంలోనూ షాజహా నుండి 4వేలు జూ. అసిస్టెంట్ ప్రసాద్ లంచం తీసుకున్నారు. షాజహా ఫిర్యాదుతో ఎసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. ..