KGBV: ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన కేజీబీవీ విద్యార్థులు

సిరాన్యూస్‌, రాజన్న సిరిసిల్ల
ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన కేజీబీవీ విద్యార్థులు

ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన కేజీబీవీ విద్యార్థులను గురువారం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో అభినందించి, ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఇంటర్ సంవత్సరం లో కెజిబివి సిరిసిల్ల ఎంపీసీ జి. గంగాభవాని 987 /1000 , కెజిబివి. మర్రిపల్లి బైపీసీ లో ఎం. ప్రసన్న 978 /1000, కేజిబివి తంగళ్లపల్లి సీఈసీ లో జి. వైష్ణవి 911/1000 , ఎంపీహెచ్‌డ‌బ్లు లో పి. హాసిని 980 /1000 ప్రథమ సంవత్సర ఫలితాలు కే.జి.బి.వి.సిరిసిల్ల బైపీసీ లో కె. వైష్ణవి 433/440, కే.జి.బి.వి. మర్రిపల్లి ఎంపీసీ లో జి. హస్విత 453/470. కెజిబివి రుద్రంగి డి. హరిక 452/470, కే.జి.బి.వి. తంగల్లపల్లి, సీఈసీ లో వై. అశ్విని 440/500 ,ఎంపీహెచ్‌డ‌బ్లు లో సి ఎచ్. రేష్మ 480/500 మార్కులు సాధించారు . ఇంటర్ ద్వితీయ సంవత్సరం 205 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 174 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం 271 మంది విద్యార్థులకు 230 మంది ఉత్తీర్ణత సాధించారు మొత్తం 85శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో డీఈఓ రమేశ్ కుమార్, సెక్టోరల్ అధికారి పద్మజ, కేజీబీవి పాఠశాలల స్పెషల్ ఆఫీసర్స్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *