బాలానగర్ లో ఈటల ప్రచారం

 సిరా న్యూస్,కూకట్ పల్లి;
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ లోనీ ఇంద్రానగర్, శ్రీ శ్రీ నగర్ కాలనీల్లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఈటల రాజేందర్. స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. అయనకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ఈటెల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆవిరి నెరవేర్చడంలో విఫలమైందని, టిఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. కచ్చితంగా మల్కాజ్గిరిలో బిజెపి జెండా ఎగరవేస్తామని అన్నారు. స్థానికుల నుండి అపూర్వస్పందన లభించిందన్న ఈటల రాజేందర్, ఈసారి దేశంకోసం, మోదీకోసం బీజేపీకి ఓటువేస్తామని అంటున్నారని తెలిపారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *