సిరాన్యూస్, ఆదిలాబాద్
జిల్లాలో మాదకద్రవ్యాల రూపుమాపడమే లక్ష్యం: జిల్లా ఎస్పీ గౌష్ ఆలం
పట్టణంలో ముమ్మర తనిఖీలు
* మాదకద్రవ్యాలపై ప్రత్యేక ఆపరేషన్
* మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్న చెక్ పోస్ట్ ల తనిఖీ
జిల్లాలో మాదకద్రవ్యాల సంపూర్ణ రూపుమాపడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. శనివారం ఉదయం రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి మద్యం, గంజాయి, డబ్బు అక్రమంగా తరలించకూడదనే ఉద్దేశంతో ఆకస్మికంగా ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో మాదకద్రవ్యాలను సంపూర్ణంగా రూపుమాపాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ సిబ్బందితో మాదకద్రవ్యాలను గుర్తించే విధంగా తనిఖీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తనిఖీలలో భాగంగా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలు, ఠాకూర్ హోటల్ వద్ద గల ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తదుపరి ఠాగూర్ హోటల్ వద్ద ఆదిలాబాద్ పట్టణంలోకి వచ్చే వాహనాలను బస్సులను తనిఖీ చేసి జిల్లాలోనికి ఎటువంటి మద్యం, డబ్బు, గంజాయి, మాదకద్రవ్యాలు రాకుండా పటిష్టమైన తనిఖీ నిర్వహిస్తున్న తెలియజేశారు.మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా సరిహద్దుతో ఉన్న తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ , మాండ్వి లోని పిప్పల్ గావ్, పాట చెక్పోస్ట్లను తనిఖీ చేశారు. మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ కు వచ్చే వాహనాలు, మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది 24 గంటలు అప్రమత్తతో ఉంటూ ఎటువంటి డబ్బు, మద్యం, గంజాయి, ఓటర్లను ప్రభావితం చేసే బహుమతులు వాటిని అనుమతించకూడదని తెలియజేశారు. వాహనాలు తనిఖీల క్రమంలో వీడియోగ్రఫీ తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, రెండవ పట్టణ సీఐ ఏ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.