సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రజలు అత్యవసరమైతేనే తప్పా బయటకు రాకూడదు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
* వడదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ఎండల తీవ్రత రోజు రోజుకు ఎక్కువ వుతున్నందున జిల్లా ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించి వడదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు.
వడదెబ్బ లక్షణాలు:
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:
* ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకొనేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* తరచూ నీళ్ళు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్ళేటపుడు వెంట మంచి నీళ్ళు తీసుకెళ్లాలి.
* వేసవిలో ఎక్కువగా నిమ్మ రసం, కొబ్బరి నీళ్ళు వంటివి సేవిస్తూ ఉండాలి.
* తెలుపు రంగు మారియులేట వర్ణములు కలిగిన పలుచని కాటన్ వస్త్రాలని ధరించాలి
* తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి లేదా రుమాలు చుట్టుకోవాలి.
* పలుచని మజ్జిగా, గ్లూకోజ్ నీరు, చిటికెడు ఉప్పు చెంచా చెక్కెరను ఒక గ్లాసు నీటిలో కలుపుకొని ఇంటిలోనే తయారు చేయబడిన ఓ ఆర్ యస్ ద్రావణం త్రాగినట్లైతే వడదెబ్బ నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది.
* వడదెబ్బ తగిలిన వారిని నీడలో , చల్లని ప్రదేశాలలో ఉంచాలి.
* శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కావున సాధారణ ఉష్ణోగ్రత తగ్గేవరకూ తదిగుడ్డతో తుడుస్తూ ఉండాలి. చంటి పిల్లలు, గర్బిణిలు , చిన్న పిల్లలు, వృద్దులు అనారోగ్యంతో ఉన్నవారు వాడగాల్పులకు గురికాకుండా కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.
* వడదెబ్బకు గురి అయినవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
* జిల్లా కలెక్టరేట్ లలో, ముఖ్యమైన ప్రదేశాలలో టీఎస్డీపీఎస్ ద్వారా ఏర్పాటు చేయబడిన లేద వాతావరణ బోర్డులలో సూచించబడు కలర్ కోడ్ ల ద్వారా జారీ చేయబడు హెచ్చరికలను , తీసుకోవాల్సిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి’
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడానివి:
* ఎండలో తిరగకూడదు. బాగా ముదురుగా ఉండే రంగు దుస్తులు ధరించకూడదు.
* కాఫీలు, టీలు అధిక వేడిమి సమయంలో సేవించడం మంచిది కాదు.
* అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలకు వెళ్ళ కూడదు.
* ఎండ వేడిలో ఎక్కువసేపు పనిచేయకూడదు. మద్య మద్యలో చల్లని ప్రదేశంలో సేదతిరుతూ పనిచేయాలి.
* తగిన జాగ్రత్తలు లేని, నిల్వ చేయబడిన ఆహార పదార్థాలు అధిక వేడివలన తొందరగా చెడిపోతాయి. వాటిని భుజించవద్దు. లేనిచో డయేరియాకు గురి అయ్యే ప్రమాదం ఉంటుంది.
* ఎండలో పార్క్ చేయబడిన కారులో చిన్న పిల్లలను, వృద్దులను , ఆరోగ్యం బాగాలేని వారిని ఎక్కువ సేపు ఉంచకూడదు.
* తలపై రక్షణ (గొడుగు, టోపీ, రుమాలు) లేకుండా ఎక్కువ సేపు ఎండలో ఉండకూడదు.
* వడదెబ్బ తగిలిన వారిని వేడి నీటిలో తడిపిన గుడ్డతో తుడువకూడదు.
* వడదెబ్బ తగిలిన వారిని సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లుటలో ఆలస్యం చేయకూడదు. ఈ జాగ్రత్తలు పాటించి వడదెబ్బ తగలకుండా చూసుకోవాలని ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు అత్యవసరమైతేనే తప్పా బయటకు రాకూడదని ప్రజలను కోరారు.