సిరాన్యూస్, బేల
రూ.93వేల నగదు పట్టివేత
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బేలల మండలంలో గల శంకర్ గూడా రహదారి వద్ద శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.93,000 నగదు పట్టుబడినట్లు ఎస్సై రాధిక తెలిపారు. మహారాష్ట్ర చంద్రపూర్ నుండి నాందేడ్ వెళ్తున్న వాహనం (ఎంహెచ్34బీవీ 9000) ను పోలీసులు తనిఖీ చేయగా గురు అనే వ్యక్తి దగ్గర ఈ నగదు కి ఎలాంటి ఆధారాలు లేక పోవడంతో పోలీసులు 93 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ నగదును ఎస్ ఎస్ టి కమిటీకి అప్పగించారు.