సిరాన్యూస్, కడెం
అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ లో శనివారం బొడ్డు గంగన్న సహకారంతో నిర్వహిస్తున్న అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబలిని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.బొడ్డు గంగన్న ను ఎమ్మెల్యే, ప్రజలు అభినందించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ అంబలి పంపిణీ కార్యక్రమం చేపడతారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు