ముచ్చటగా మూడవసారి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
 సిరా న్యూస్,భువనగిరి;
భువనగిరి పార్లమెంట్ MP స్థానాన్ని ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి , ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్అభ్యర్థిని గెలిపించేందుకు కార్యకర్తలు కృషిచేయాలన్నారు.పదేండ్లలో కేసీఆర్ తన కుటుంబ
సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు తప్ప.. తెలంగాణలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.కాంగ్రెస్ సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు.హరీష్ రావు కి ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారాని దుయ్యబట్టారు.ప్రజాస్వామ్యాన్ని కుని చేసిన వ్యక్తి ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసిన వ్యక్తి కెసిఆర అన్నారు. బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ కండువాలు జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *