దివంగత సాయన్నను అవమానించిన కేసీఆర్

 సిరా న్యూస్,సికింద్రాబాద్;
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం దళిత ఎమ్మెల్యే ను అవమానించడమే అని కంటోన్మెంట్ భాజపా అభ్యర్థి వంశిశ తిలక్ అన్నారు..దివంగత ఎమ్మెల్యే సాయన్న పట్ల కెసిఆర్ కు సానుభూతి లేనప్పుడు ఆయన కుటుంబాన్ని సభ్యులపై కంటోన్మెంట్ ప్రజలు సానుభూతి చూపాల్సిన అవసరం లేదని కంటోన్మెంట్ భాజపా అభ్యర్థి వంశా తిలక్ అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మూడవ వార్డులోని కేకే నగర్ లో భాజపా కార్నర్ మీటింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ లో భాజాపాకు ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్టే అని అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్లో తాగునీటి సమస్యను పట్టించుకున్న పాపను పోలేదని అన్నారు. కాంగ్రెస్ బారాస నాయకులు చెబుతున్న మాటలను నమ్మి కంటోన్మెంట్ ప్రజలు మోసపోవద్దని ఆయన సూచించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *