సిరా న్యూస్,హైదరాబాద్;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సిపిఎం నేతలతో భేటీ అయ్యారు.తరువాత అయన మట్లాడుతూ సీపీఎం నాయకులతో చర్చించాం. భువనగిరి పార్లమెంట్ తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరాం. మరి కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా వారి ముందు పెట్టాం. బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారు. దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేయనున్నారు. ఒకట్రెండు విషయాల్లో సందిగ్దత ఉన్నా… అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తాం. సీపీఎం సహకారంతో భవిష్యత్ లో ముందుకెళతాం.ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందని భావిస్తున్నాని అన్నారు…
================xxx