సిరా న్యూస్,ఓదెల
తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు తహసీల్దార్కు వినతి
* ఆటో యూనియన్ అధ్యక్షులు తూడి శంకర్
తమను ఆదుకోవాలని కోరుతూ ఆటో యూనియన్ తరపున ఆటో డ్రైవర్లు శనివారం ఓదెల మండల తహసీల్దార్ యాకన్నకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఓదెల గ్రామ ఆటో యూనియన్ అధ్యక్షులు తూడి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల మహిళలు మా ఆటోలు ఎక్కడమే మానేశారని తెలిపారు. తద్వారా మాకు రోజుకు 200 నుండి 300 కూడా మిగలడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొన్న ఆటోకు రోజువారి ఫైనాన్సు నెల వారి. కిస్తి లు, అప్పులు కట్టలేక మా భార్య పిల్లల్ని పోషించుకోలేక ఇప్పటివరకు రాష్ట్రంలో 50 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని తెలిపారు. బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం యొక్క పథకం మాకు గొ డ్డలి పెట్టుగా మారిందని తెలిపారు. 10000 ఉన్న ఆటో ఇన్సూరెన్స్ ను వెయ్యి రూపాయలకు తగ్గించాలి .ప్రత్యేక ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వలన ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్ల కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్ కు నెలకు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందించాలని కోరారు. ఏ కారణం చేతనైనా చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి 5 లక్షలు వచ్చే విధంగా ఆటో భీమాను ఏర్పాటు చేయాలని తెలిపారు.అర్హులైన వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రజలకు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న ఆటో డ్రైవర్లకు 50 సంవత్సరాలు పైబడిన వారికి 10000 పెన్షన్ అమలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓదెల గ్రామం ఉపాధ్యక్షులు మంద రామకృష్ణ కోశాధికారి పసిడ్ల స్వామి. నరేడ్ల కుమార్. పిట్టల రమాకాంత్, కనకిరెడ్డి రాజు ఎగిరెడ్డి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.