సిరా న్యూస్,ఓదెల
నేత్రదాత నంది శంకరయ్యకు సంస్మరణ సభ
సదా శయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అభినందన పత్రం అందజేత
ఓదెల మండల కేంద్రానికి చెందిన నంది శంకరయ్య మరణించగా ఆయన నేత్రాలు సదా శయ ఫౌండేషన్ వారు సేకరించారు. మరో ఇద్దరి అంధులకు చూపునిచ్చిన నంది శంకరయ్య సంస్మరణ సభను శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా సదా శయ ఫౌండేషన్ కుటుంబ సభ్యులకు అభినందన పత్రం అందజేశారు. కార్యక్రమంలో కొండ్ర వేణు, క్యాతంవెంకటేశ్వర్లు, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, అల్లం సతీష్, సంతోష్, నవీన్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.