అవనిగడ్డలో జానీ మాస్టర్ ప్రచారం

సిరా న్యూస్,అవనిగడ్డ;
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అవనిగడ్డ అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మండల బుద్ధ ప్రసాద్ , మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి విజయాలను కాంక్షిస్తూ అవనిగడ్డ పురవీధులలో గాజు గ్లాసు చేత పట్టుకుని ఇరువురి అభ్యర్థుల సింబల్ అయిన గాజు గ్లాస్ ను ప్రజలకు చూపిస్తూ ప్రచారంలో భాగంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నన్ను ఒక బ్రదర్ లాగా ఆదరించారు… ఈరోజు ఇక్కడ నేను ప్రచారం చెయ్యడానికి గల కారణం గతంలో రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి వాటన్నింటినీ తుంగలో తొక్కారు ఆ సమస్యలను పరిస్కరణ కోసం కల్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను ఖచ్చితంగా పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తాను… పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా డైరెక్ట్ గా ఎదుర్కోలేని వాళ్ళు గుర్తులు మార్చి, ఒకేలా పేర్లు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు.. కూటమిని ఆదరించండి మన ఊరు బాగుంటుంది… మన ఊరితో పాటుగా రాష్ట్రం, దేశం కూడా సు సంపన్నంగా ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జానీ మాస్టర్ తో మండలి వెంకట్రామ్ (రాజా) ,గుడివాక శేషుబాబు రాయపూడి వేణుగోపాలరావు , గుడివాక శివరాం ,రావి రత్నగిరి ,కొల్లూరు వెంకటేశ్వరరావు, తెలుగుదేశం బిజెపి జనసేన కార్యకర్తలు ,భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *