సిరా న్యూస్, చిగురుమామిడి
బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి : సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి
* కార్యకర్తలకు దిశా నిర్దేశం
కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శనివారం చిగురుమామిడి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధిస్తుందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులు, అన్ని వర్గాల వారు తీవ్ర వ్యతిరేకత కనబడుస్తున్నారని తెలిపారు. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను గడపగడపకు తీసుకువెళ్లి పార్టీ గెలుపులకు కృషి చేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. కరీంనగర్ పార్లమెంటరీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలందరూ కంకణ బద్ధులై పని చేయాలన్నారు. కష్టపడి పని చేసే కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు , విద్యార్థి విభాగం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.