సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
మైనార్టీ విభాగం ఇన్చార్జి జూనేద్ మెమెన్ ను సన్మానించిన షబ్బీర్ పాషా
ఆదిలాబాద్ పార్లమెంట్ మైనార్టీ విభాగంఇన్చార్జి జూనేద్ మెమెన్ తొలి సారి ఖానాపూర్ విచ్చేసిన సందర్భంగా శనివారం ఖానాపూర్ మైనారిటీ విభాగం నియోజకవర్గ ఇన్చార్జి షబ్బీర్ పాషా ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోకి ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఇంచార్జి సత్తు మల్లేష్ తో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ మైనార్టీ ఇన్చార్జి జూనేద్ మెమెన్లు హాజరయ్యారు. ఈసందర్బంగా తొలి సారి ఖానాపూర్ నియోజకవర్గానికి విచ్చేసిన జూనేద్ మెమెన్ ను మైనార్టీ నాయకుల తరవున ఖానాపూర్ నియోజకవర్గ మైనార్టీ అబ్జర్వర్ షబ్బిర్ పాషా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి సుగుణక్క ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ మండల మైనార్టీ అధ్యక్షులు సలీం ఖాన్,సీనియర్ నాయకులు అమనుల్లా ఖాన్, మొహమ్మద్ ఖాజా, ఆసిఫ్ అలీ, సయ్యద్ ఆయుబ్, శారు, ఎం ఏ నయీమ్ తదితరులు పాల్గొన్నారు.