సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలి
ఐఎఫ్టూయూ జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్
* 138వ మేడే పోస్టర్లు విడుదల
బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని ఐఎఫ్టూయూ జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్ అన్నారు.శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే138 వ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో 10 సంవత్సరాల పాలనలో పరిశ్రమల మూతపడ్డాయని తెలిపారు. దీంతో కార్మికుల బజారున పడ్డారని తెలిపారు. కాంటాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు కరువై, కోర్టు తీర్పులను పక్కనపెట్టి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు గా కుదించారని తెలిపారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసే కుట్రకు పసిగట్టిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను మోసం చేశాడన్నారు. కులం పేరుతో, మతం పేరుతో రాముడు దేవుడి మందిరాల పేరుతో ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి అనేక మాయ మాటలు చెబుతూ మన ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇలాంటి మోసపూరితమైన బిజెపి నరేంద్ర మోడీ మాటలు ప్రజలు కార్మికులు రైతులు నమ్మవద్దని సూచించారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య ఐక్యతను శ్రమజీవుల మధ్య ఐక్యత పై దాడి చేస్తుందన్నారు. కార్మిక వర్గం ఇటువంటి విభజన విధానాలను తిప్పికొట్టాలని, బిజెపి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని సూచించారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి దుర్గం లింగన్న, నాయకులు మాలావ త్ జెవింధ్,ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గోనె స్వామి, నాయకులు కు డుదుల రాజేశ్వర్, గూట్ల ప్రసాద్ మాన్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.