సిరాన్యూస్, బోథ్
ఘనంగా బోథ్లో శబరిమాత ఆలయ వార్షికోత్సవం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని శబరిమాత ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ వార్షికోత్సవానికి వివిధ గ్రామాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పూజారి ఎడమల ధర్మారెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు.ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.