రాష్ట్ర అభివృద్ధి బిసివై పార్టీతోనే సాధ్యం…

ఎమ్మెల్యే అభ్యర్థి మిద్దె వెంకటేశ్ యాదవ్
పత్తికొండ నియోజకవర్గ ప్రజలు ఆదిరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా.

 సిరా న్యూస్,పత్తికొండ:
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే భారత యువజన చైతన్య పార్టీ తోనే సాధ్యమని బీసీవై పార్టీ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి మిద్దె వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు.శుక్రవారం స్థానిక బిసివై పార్టీ కార్యాలయంలో పత్తికొండ పట్టణానికి చెందిన యాభైమంది యువకులు బిసివై పార్టీ కండవ కప్పుకున్నారు.ఈ సందర్భంగా బీసీవై పార్టీ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి మిద్దె వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు బిసివై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తోడుంటారని అలాంటి వారికోసం యువకులు అంతా ముందుండి పనిచేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.అంతేకాకుండా బిసివై పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో, యువతకు,మహిళలకు,రైతులకు,వివిధ రకాల వృత్తులు వారికి అనేకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని బోడె రామచంద్ర యాదవ్ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. అదేవిధంగా పత్తికొండ నియోజవర్గం నుండి నన్ను ఆశీర్వదించి ఓటర్లు ఓటు వేసి గెలిపిస్తే నియోజవర్గ ప్రజలకు ప్రతి నెల రెండవ శనివారం తిరుమలకు ఉచిత బస్సు సదుపాయం,ప్రతి ఇంటికి ఒక ఆవును ఇవ్వడం,ప్రజలకు,రైతుల అందరికి సాగునీరు సదుపాయం కల్పిస్తూ, తుగ్గలి మండలానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని, నియోజవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రికల్చర్, డిప్లమా,వెటర్నరీ,పాలిటెక్నిక్, కాలేజీలో ఏర్పాటు చేసి,నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా మంచినీరు సదుపాయం,యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పన ఏర్పాటుకు కృషి చేస్తానని,నియోజవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఆటో కార్మికులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని,ఎస్పీ.ఎస్టి.బిసి. మైనార్టీల ఆరోగ్యం కొరకు ప్రజలందరికీ బీసీవై పార్టీ తరఫున లక్ష రూపాయలు ఉచిత బీమా సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో యువకులు విజయ్,వీరేష్,అనిల్,సుమన్, పవన్,రాజేష్,వీరితో పాటు మరో 50మంది యువకులు బీసీ వై పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *