సిరా న్యూస్,తిరుపతి;
స్థానిక కళాకారులను వారి ఉత్పత్తులను ఆదరించాలని శిల్పారామం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఖాదర్ వలీ పిలుపునిచ్చారు.
తిరుపతి ఖాదీ కాలినలో గల శివశక్తి కళ్యాణ మండపంలో సంస్కృతి కల్చరల్ క్రాఫ్ట్ సొసైటీ తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత ,హస్తకళల మేళాను ముఖ్య అతిథిగా విచ్చేసిన శిల్పారామం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఖాదర్ వలీ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఖాదర్ వలికి మేళ నిర్వాహకులు దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేయగా రిబ్బన్ కట్ చేసి మేళాను ప్రారంభించారు. మేళాను ప్రారంభించిన తర్వాత స్టాళ్లను సందర్శించి మేళ నిర్వాహకులను అభినందించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు నుండి 18 రోజులు పాటు జరిగే ఈ మినీ మేళా లో వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన 35 మంది కళాకారులు తమ ఉత్పత్తులు ను అమ్మకం కోసం అందుబాటులో ఉంచారు అని వివరించారు. ముఖ్యం గా జైపూర్ కి చెందిన బెడ్ షీట్స్ , సహరంగపూర్ ఉత్తరప్రదేశ్ కి చెందిన చెక్క తో తయారుచేసిన గృహాలంకరణ వస్తువులు, కలంకారి చీరలు , మీరట్ నుండి వచ్చిన చెప్పులు, మన రాష్ట్రానికి చెందిన కొనడపల్లి బొమ్మలు, కడపకి చెందిన చేనేత టవల్స్, కాటన్ షర్ట్స్ ఖాదీ టాప్ , షోలాపూర్ చెప్పులు, హైదరాబాద్ కి చెందిన హ్యాండ్బులాక్ ప్రింటెడ్ చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్ మొదలైన 20 మంది కళాకారులు చే మినీ మేళాలో అందుబాటులో ఉంటాయని అన్నారు.
===========================