రెండు విడతల్లో పెన్షన్ పెంపు

సిరా న్యూస్,తాడేపల్లి;
: ఆంధ్రప్రదేశ్ లో వైసిపి రెండు పేజీల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. తొమ్మది ప్రధాన హామీలతో మేనిఫెస్టోను విలీజ్ చేసిన జగన్.. చేయగలిగిన హామీలను మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. వృద్ధులకు పెన్షన్ ను పెంచనున్నట్లు తెలిపారు.అయితే రెండు విడతల్లో ఈ పెన్షన్ నుంచి రూ. 3000 నుంచి రూ. 3500కు పెంచుతామన్నారు. 2028లో జనవరిలో రూ. 250 పెన్షన్ పెంచుతామని.. 2029 జనవరిలో మరో రూ.250 పెన్షన్ ను పెంచుతామని ఆయన చెప్పారు. ఇక, అర్హులైన వారందరికీ ఇళ్లు పంపిణీ స్కీమ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
=============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *