సిరాన్యూస్, సైదాపూర్
జమ్మికుంట జనగర్జన బహిరంగ సభకు సీఎం రాక : మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్
హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట కాలేజీ గ్రౌండ్ లో ఈనెల30న నిర్వహించే జనగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, సీనియర్ నాయకులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.