సిరాన్యూస్, కుందుర్పి
వైసీపీని వీడి టీడీపీలో చేరిన 80 కుటుంబాలు
అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రం నుంచి వైసీపీకి చెందిన 80 కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరారు. వైసీపీ మేనిఫెస్టోతోనే జగన్ మోసం చేశారని బూడిద మల్లికార్జున బలిజ శేఖర్ మాజీ కో ఆప్షన్ మెంబర్ తాహీర్ బాషా, బోయ బసప్ప . సజ్జల శ్రీనివాసులు కురువ మాయల మరి స్వామి మల్లికార్జున ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో చేరారు. ఈసందర్భంగా వారికి సురేంద్ర బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాకు జగన్ ప్రభుత్వం వస్తే చాలా అసహ్యంగా ఉంటుందని, టిడిపి ప్రభుత్వం వస్తే చాలా గర్వంగా చెప్పుకుంటామని తెలిపారు. కుందుర్పిమండల టీడీపీ నాయకులు సోమవారం సురేంద్రబాబు ఆయనతో కలిసి మెలసి సుఖ సంతోషాలతో మేము ఏనాటికైనా టిడిపి పార్టీ రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు ని గెలిపించాలని మేమందరం కృషి చేస్తామని తెలిపారు.