సిరాన్యూస్, జైనథ్
మోదీ అభివృద్ధి అంటే.. ఇదిగో అని అక్షింతలు పంపిస్తున్నారు : మంత్రి సీతక్క
* ఆత్రం సుగుణ ను భారీ మెజార్టీతో గెలిపించాలి
* ధూంధాం గా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
అయ్యా ..మోదీ అభివృద్ధి అంటే ఇదిగో అని అక్షింతలు పంపిస్తున్నాడంటూ తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , మహిళా శిశుసంక్షేమ శాఖామంత్రి సీతక్క అన్నారు.ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంఛార్జి కందిశ్రీనివాస రెడ్డి నేతృత్వంలో జైనథ్ బేలలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ తో పాటు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జైనథ్ సెంటర్ లో తన ప్రసంగంతో శ్రేణుల్లో జోష్ నింపారు. జైనథ్ లో ప్రజలకు కాంగ్రెస్ అంటే విపరీతమైన అభిమానమని ఇంత మందిని చూస్తేనే అర్ధమవుతందని స్థానికుల్లో ఉత్సాహాన్నినింపారు. బీజేపీ మాట్లాడితే మా రాముడు మా దేవుడు అంటుందని మరి ఇక్కడ ఆలయాలు ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నంచారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి అన్నారు. అయోధ్యలో కట్టిన రామమందిరానికి ఇక్కడి ప్రజల నుండికూడా వసూలు చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తామని.. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. సామాన్యుల వస్తువులపై పన్నులు వేసి భారం పెంచిందని విమర్శించారు. మహిళల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఆశపెట్టి రూపాయి కూడా వెయ్యలేదని అన్నారు. కాని అయోధ్య నుంచి మాత్రం అక్షింతలు పంపించారన్నారు.ఇక మాజీ సీఎం కేసీఆర్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బీఆర్ ఎస్ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తుందని అన్నారు. పేదలకు భూములను పంచింది కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అలాంటి కాంగ్రెస్ కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేశం మరింత అభివృద్ధిమీ చెందుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో 50ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులకు.. ఇప్పుడు కట్టిన ప్రాజెక్టులు ఎంత తేడా ఉందో గమనించాలని ఇప్పుడన్నీ కమీషన్ లను కక్కుర్తి పడి చేపి పనులని అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధిని తన భుజాలపై వేసుకుంటానని హామీ ఇచ్చారు. త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని ఆయనను ప్రధానిగా చూడాలని దేశం కోరుకుంటుందని అన్నారు. అందుకే అందరూ చేతి గుర్తుకే ఓటు వేసి ఇక్కడి ఎంపీ అభ్యర్ధి ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి జరగకుంటే ప్రశ్నించండని అన్నారు.
బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలతో ఆదిలాబాద్ అభివృద్ది జరగదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిసిస్తేనే.. ఆదిలాబాద్ అభివృద్ది సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నీళ్లు ఇచ్చింది, నిధులిచ్చింది,ఇండ్లించ్చింది రుణాలిచ్చిందని గుర్తు చేసారు. అందుకే ఓటు అడిగే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందన్నారు. ఒక పేదింటి ఆడబిడ్డను కొంగు చాచి అడుగుతున్నానని తనను మీ ఓట్లతో దీవించాలని ఆత్రం సుగుణ ఓటర్లకు విన్నవించారు. తనను గెలిపిస్తే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకనై పార్లమెంటు లో మన సమస్యలపై గళం విప్పుతానన్నారు.
గత ప్రభుత్వాలు ఆదిలాబాద్ అభివృద్ధిని విస్మరించాయని కాని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వమన్నారు.మన జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క కు ఇక్కడి వారిపై ఎనలేని ప్రేమని అందుకే ఎప్పుడు పిలిచినా పుట్టింటి బిడ్డ లాగా వచ్చి మన సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. ఇక మరో ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మన పుట్టింటి బిడ్డకు ఒక్కసారి అవకాశం ఇవ్వండని ఓటర్లను కోరారు మన గిరిజన బిడ్డకు అవకాశం ఇవ్వమని అడగడానికి మంత్రి సీతక్క వచ్చారని ఆమె కోరిక నెరవేర్చాలన్నారు .తను గెలిచినా ఓడినా ఎప్పుడూ ప్రజల మనిషినేనని తాను ఎప్పుడొచ్చినా ఎంతో ఆదరణ చూపిస్తున్న ప్రజలకు ధన్యవాదాలని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వరకు డబుల్ రోడ్డు నిర్మాణంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికై గ్రామస్తుల తరపున ఆయన మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేసారు. అనంతరం జైనథ్ లోని సుప్ర సిద్ధ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని మంత్రి సీతక్క ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ , అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి తో కలిసి సందర్శించారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. ఆలయంలో గోత్రనామాలతో అర్చనలు , ప్రత్యేక పూజలు
నిర్వహించారు