చిన్నారి అదృశ్యం

 సిరా న్యూస్,మహబూబ్ నగర్;
మహబూబ్నగర్ మండలం బొక్కలోనిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి మూడేళ్ల బాలుడు అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. రాత్రి తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలుడు ఉదయం లేచి చూసే సరికి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జాగిలాల సహాయంతో గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు జాగిలాల రైల్వె లైన్ వరకు వెళ్లి నిలిచిపోయాయి. బాలుడిని ఎవరైనా ఎత్తుకువెళ్లారా లేక జంతువులు దాడిచేసి ఎత్తుకెళ్లాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *