Farmers must spray salt water, AO Says: ఉప్పునీటి ద్రావణాన్ని పిచికారీ చేయాలి..

సిరా న్యూస్, గొల్లప్రోలు:

ఉప్పునీటి ద్రావణాన్ని పిచికారీ చేయాలి..

వర్షానికి తడిసిపోయిన పంటలనురక్షించుకునేందుకు రైతులు విధిగా ఉప్పునీటి ద్రావణాన్ని పంటలపై పిచికారి చేసుకోవాలని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండల వ్యవసాయ శాఖాధికారి సత్యనారాయణ సూచించారు. మంగళవారం తహశీల్దార్ వెంకటేశ్వరరావుతో కలిసి మండలంలోని చేబ్రోలు, చెందుర్తి, ఏకే మల్లవరం గ్రామాల్లో పర్యటించారు. సందర్భంగా రైతులకు పలు సూచనలు సలహాలు అందించారు. మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షానికి పంట నష్టపోకుండా వరి కుప్పలు మీద బరకాలు వేసి తాడులతో కట్టుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *