Prabhakar Reddy: ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దాం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దాం
* సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
* మే 3న సీపీఐ జనరల్ బాడీ సమావేశం

ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణు భారీ మెజార్టీతో గెలిపిద్దామ‌ని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి సబ్ అధ్యక్షత గుండాల రాములు వాయించ‌గా, ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళవేణ శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి సభ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా క‌ళ‌వేణి శంకర్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అణగారన ప్రజలకు అన్యాయం చేస్తూ పెద్దలకు దోసి పెడుతుంద‌న్నారు. కార్పొరేట్ శక్తులకు ప్రోత్సహిస్తూ మతవాదంతోటి దేశంలో రాజా వెళుతున్నాయని తెలిపారు. ఇలాంటి మతోన్మాదం దేశ ద్రోహులు తరిమికొట్టాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో స్వచ్ఛందంగా సిపిఐ శ్రేణులు ఎలాంటి ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు తెలుపాల‌న్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలని పిలుపునిచ్చా రు. అనంత‌రం సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మహిళకు ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం శుభపరిణామని తెలిపారు. ఇది స్వతంత్ర చరిత్రలోనే ఆదిలాబాద్ కు గర్వకారణమ‌న్నారు. ఆత్రం సుగుణక్క పోరాట యోధురాన్ని ఆదివాసి బిడ్డను మనం లక్షలాది మెజార్టీతోటి గెలిపించడానికి సిపిఐ, సిపిఐ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి బలపరుస్తూ పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్న సుగుణక్కకు పార్టీ స్వాగతం పలుకుతూ ఈనెల మూడో తారీఖు ఉదయం 11 గంటలకు సిపిఐ జనరల్ బాడీ సమావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు సీతక్క ఎంపీ అభ్యర్థి సిపిఐ రాష్ట్ర నాయకులు వస్తున్నారని తెలిపారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళిని రెడ్డి , జిల్లా కార్యవర్గ సభ్యులు గడ్డం భూపతిరెడ్డి, బి గోవర్ధన్, ఎస్ అరుణ్, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా బేగం, బి కే యం యు ప్రధాన కార్యదర్శి అర్ధాంగి రమేష్ , గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పొ్చ్చరం , సిపిఐ సీనియర్ నాయకులు ప్రజానాట్య మండల జిల్లా అధ్యక్షులు కట్ట కృష్ణ స్వామి, జిల్లా కౌన్సిల్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *