Jogu Ramanna: ఉచితాల పేరుతో కాంగ్రెస్ ఉత్త మాటలు : మాజీ మంత్రి జోగు రామన్న

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌రూర‌ల్‌
ఉచితాల పేరుతో కాంగ్రెస్ ఉత్త మాటలు : మాజీ మంత్రి జోగు రామన్న
* మండలంలో బీఆర్ఎస్‌ విస్తృత ప్రచారం

ఉచిత కరెంటు ..ఉచిత గ్యాస్ .. మహిళలకు 2500 అంటూ కాంగ్రెస్ ఉత్త మాటలతో ప్రజలను మభ్యపెట్టింద‌ని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. సోమ‌వారం ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూర‌ల్ మండ‌లంలో బీఆర్ ఎస్ నాయ‌కుల‌తో క‌లిసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్నలు విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ ఆదివాసులకు విద్య, వైద్యంతో పాటు తాగునీరు సౌకర్యం కల్పించి, జీవన మార్గదర్శకంగా నిలిచింది బిఆర్ఎస్ ప్రభుత్వమేన‌ని అన్నారు. ఆదివాసి హక్కుల పోరాటానికి ప్రశ్నించే గొంతుకగా త‌న‌ను గెలిపించాలని కోరారు.  గత ప్రభుత్వం ఆదివాసి సంక్షేమానికి పెద్దపీట వేసింది అన్నారు. విద్య‌, రవాణాతో పాటు వైద్యాన్ని అందించింది అన్నారు . ఆదివాసీల పోడు భూములకు పట్టాలు గత కెసిఆర్ ప్రభుత్వం కల్పించిందన్నారు. నేడు ఆదివాసుల సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతుకగా తమతో ఎప్పుడూ అండగా ఉంటారని ఆత్రం సక్కు తెలిపారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింద‌న్నారు. బీజేపీ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సామాన్యుడికి నిత్యవసర సరుకుల రేట్ల తో పాటు గ్యాస్ సిలిండర్ , ఉచిత గ్యాస్ ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల‌ను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో ఎంపీ అభ్యర్థిగా ప్రజల పక్షాన తన విజయాన్ని సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రోకండ్ల రమేష్, ఎంపీపీ గండ్రత రమేష్, సేవ్వా జగదీష్ కుమ్రా రాజు, పరమేశ్వర్, గంగయ్య, రమణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *