సిరాన్యూస్, భీమదేవరపల్లి
మల్లారంలో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం
భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. రాబోయే ఎంపీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మల్లారం గ్రామ శాఖ అధ్యక్షుడు చింతరాజు, మాజీ సర్పంచ్ గూడెల్లి రాజిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ తిరుమలరెడ్డి, సీనియర్ నాయకులు ఏదునూరి శ్రీధర్, ఇట్టబోయిన తిరుపతి, గరిగే సారయ్య, నాగిళ్ల లింగస్వామి, నవీన్, సాయి కిరణ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.