అభివృద్ధి ప్రధాతలు దుద్దిల్ల శ్రీపాద శ్రీధర్ బాబులు

గడ్డం వంశీని మూడు లక్షల మెజార్టీతో గెలిపించుకుంటాం
కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు
సిరా న్యూస్,కమాన్ పూర్;

మంథని నియోజక వర్గం అంటేనే దుద్దిల్ల నియోజకవర్గ అని అలాగే గడ్డం వంశీని అత్యధిక మెజార్టీ మూడు లక్షలతో గెలిపించుకుంటామని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు.
సెంటినరీ కాలనీలో జరిగిన గడ్డం వంశీ ప్రచార సభలో కాంగ్రెస్ నేత శీను బాబుతో పాటు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైనాల రాజు మాట్లాడుతూ..
చిమలలో ఉంది సమైక్యత భావం కాకులలో ఉంది సంఘీభావం ఒక్క తల్లి బిడ్డ లాగా ఉన్న మన రెండు మండలాలలో ఎందుకు తారతమ్యాలు మనమంతా శ్రీపాద కుటుంబ సభ్యులమే మన విధానం కేవలం అభివృద్ధి మాత్రమే అని అన్నారు. గత పదేళ్ల రాక్షస పాలనలో మనం దేవుడిగా కొలిచే శ్రీపాద రావు విగ్రహాన్ని బసవాపూర్ లో నాశనం చేశారు అని పేర్కొన్నారు. ముస్త్యా లలో గడ్డపారలతో పెకిలించారు కానీ శ్రీపాద రావు మా గుండెల్లో నిలిచారు 10 సంవత్సరాల కాలంలో పుట్టిన గడ్డకు ఓటేసిన బిడ్డకు రెండించుల పైపులైన్ వేయలేని మూర్ఖులు రైతుల గురించి మాట్లాడితే ఎలా ఈ ప్రాంత రైతాంగం కోసం శ్రీపాద ఎల్లంపల్లిని నిర్మించి 2 టిఎంసీ ద్వారా గుండారం చేర్చి అక్కడి నుండి శుక్రవారం రిజర్వాయర్కు పంపించి కమాన్ పూర్ రామగిరి ముత్తారం మంథని మండలాలకు సాగునీరు అందించిన ఘనత శ్రీపాద కుటుంబానిదే అన్నారు.అంతేకాకుండా ఈ ప్రాంతంలో పండే ప్రతి గింజపై శ్రీపాద కుటుంబం పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది కొంతమంది సన్మాసులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు అంటున్నారు అన్నారు.ఎందుకు ఓటు వెయ్యద్దు అని అడుగుతున్నాను పండించిన ప్రతి బస్తా మీద ఐదు కిలోల తరుగు పేరుతో తీయకుండా రైతుకు లాభం చేస్తున్నందుకు ఓటు వేయకూడదా ప్రతి మహిళను ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినందుకు ఓటు వేయకూడదా? ప్రతి ఇంట్లో ఉచిత లైటు వెలుగుతున్నందుకు ఓటు వేయకూడదా? ప్రతి ఇంట్లో 500 రూపాయలకే సిలిండర్ వస్తున్నందుకు ఓటు వేయకూడదా ప్రతి ఇంట్లో ఏ ఆపద వచ్చినా హాస్పిటల్ పరంగా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తున్నందుకు ఓటు వేయకూడద కొంతమంది సన్నాసులు మా సంగతేంది అని మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. మీ సంగతి చెప్పే టైం దగ్గర్లోనే ఉంది మీరు చేసిన హత్యాకాండలపై సప్లమెంటరీ ఛార్జ్ సీటు వేసి మిమ్మల్ని చిప్పకూడు తినిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలగా మేము తీసుకుంటాము అని హెచ్చరించారు. మా నాయకులు మీలాంటి వెధవల గురించి ఆలోచించే అంత టైం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గా మేం జరిగిన తప్పులపై తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ మీ అటువంటి వారిని కటకటాల్లోకి పంపిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో గడ్డం వంశీకృష్ణ ని అత్యధిక మెజార్టీతోటి గెలిపించి శ్రీధర్ బాబు నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరనైనది.
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య జిల్లా యూత్ అధ్యక్షులు జెమినీ గౌడు మంథని అసెంబ్లీ యూత్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్ రామగిరి మండల అధ్యక్షుడు రోడ్డ బాబు రామగిరి మండల ఎంపీపీ ఆ రెల్లి దేవక్క కొమరయ్య మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి రామగిరి మండల ప్రచార కమిటీ చైర్మన్ ముస్తాల శ్రీనివాస్ బీసీ సెల్ మండల అధ్యక్షులు బండారి సదానందం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఖండే పోషం నాగపల్లి ఎంపిటిసి తీగల స్వప్న సమ్మయ్య ఎంపీటీసీ కొప్పుల గణపతి కలవచర్ల ఎంపీటీసీ సందీప్ రామయ్య పల్లె సర్పంచ్ రజిత శ్రీనివాస్ ముస్తాల సర్పంచ్ లావణ్య నాగరాజు రామయ్య పల్లె ఉపసర్పంచ్ నరేష్ సెంటనరీ కాలనీ టౌన్ అధ్యక్షులు కాటన్ సత్యం పన్నూరు గ్రామ శాఖ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ రత్నాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు అంజన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *