సిరా న్యూస్,భైంసా;
నిర్మల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భైంసా టౌన్ సిఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఓవైసీ నగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన పత్రాలు లేని 112 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని కంపల్సరిగా నడిపే వ్యక్తికి లైసెన్స్, హెల్మెట్ కలిగి ఉండాలని టౌన్ సీఐ రాజారెడ్డి సూచించారు. ఈ కర్డెన్ సెర్చ్ ద్వారా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవచ్చని తెలిపారు.
====================