నన్నుఅవనిగడ్డ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజన్న పాలన అందిస్తా…

అందే శ్రీరామమూర్తి
సిరా న్యూస్,అవనిగడ్డ;
అవనిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందే శ్రీరామ మూర్తి మాట్లాడుతూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకుని వెల్లతానని వెల్లడించారు.. ఇప్పటి వరకు పనిచేసిన ఎమ్మెల్యేలు అవనిగడ్డకు చేసింది ఏమీ లేదని తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సాగునీరు, త్రాగునీరు అందరికీ అందేలా చేస్తానని చెప్పారు..రాజన్న పాలన మళ్ళీ ప్రజలు చూడాలి అంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని చెప్పారు..త్వరలో అవనిగడ్డలో వై.ఎస్.షర్మిల రెడ్డి గారి భారీ బహిరంగ సభ ఉంటుందని దానికి నియోజకవర్గ స్థాయిలో వేలాదిగా ప్రజలు హాజరవుతారని చెప్పారు. అవనిగడ్డ లో 20 ప్రచార రధాలతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందంజలో ఉందన్నారు
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *