Payal Shankar: గొడం న‌గేష్‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం : ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్, జైన‌థ్‌
గొడం న‌గేష్‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం : ఎమ్మెల్యే పాయల్ శంకర్

గొడం న‌గేష్‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దామ‌ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని గూడా రాంపూర్ మంగ‌ళ‌వారం గ్రామాలలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాయకులతో కలిసి గడపగడప నా తిరుగుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో చేస్తున్న అభివృద్ధి గురించి, వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఉచిత బియ్య పథకం మహిళల కోసం వడ్డీ లేని రుణాలు, సుకన్య యోజన పథకం, మరి ఇంకా ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తూ దేశ అభివృద్ధికి ముందుకు నడిపిస్తుంద‌ని అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని మరో మారు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుందామ‌ని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాందాస్, ఆదినాథ్, రమేష్ జ్యోతి రెడ్డి, అశోక్ రెడ్డి, సుభాష్, చైతన్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *