సిరాన్యూస్, బోథ్
పదిలో సత్తా చాటిన బోథ్ గురుకులం బాలికలు
పదవ తరగతి ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. పొచ్చెర, కౌట(బి), పాట్నాపూర్, కనుగుట్ట, బోథ్ ఉర్దూ పాఠశాల పార్టీ (బి) పాఠశాలలకు చెందిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ మోడల్ స్కూల్ ,ఎస్టీ బాలికల పాఠశాల, ప్రైవేటు పాఠశాలలైన విజ్ఞాన్ సెంట్ థామస్ నాగభూషణం పాఠశాల లో 100శాతం ఫలితాలు రావడం జరిగింది. మర్ల పల్లి పాఠశాలలో 80శాతం ఫలితాలు రాగా, ధన్నూర్ పాఠశాల 87శాతం ప్రభుత్వ ఉన్నత పాఠశాల 88శాతం ఫలితాలు సాధించాయి. అయితే మండల వ్యాప్తంగా సాధించిన ఫలితాల్లో బాలికలదే పై చెయ్యి.