సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి తమ పార్టీ సభ్యులందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని సమైక్యాంద్ర పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు గొంటి కుమార్ చౌదరి ప్రకటించారు.హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేయడం తగదన్నారు. భారతదేశం లౌకిక దేశమని దేశంలో అని మతాలు సమానం అన్నారు. ప్రతి పార్లమెంట్ లో ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్ధులకు మా పార్టీ కార్యకర్తలు శక్తి వంచన లేకుండా ఇంటి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు ప్రజలకు తెలియజేస్తూ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు.