సిరాన్యూస్, ఆదిలాబాద్
బూత్ ఇన్చార్జీల పాత్ర చాలా ముఖ్యం : కంది శ్రీనివాసరెడ్డి
* పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం
* ప్రజా సేవాభవన్లో బూత్ ఇంఛార్జిల సమావేశం
ఎన్నికలేవైనా బూత్ ఇన్చార్జీల పాత్ర చాలా ముఖ్యమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ బూత్ ఇంఛార్జీల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు అతి సమీపంలో ఉన్నందున ఇప్పటి నుండే బూత్ ఇంఛార్జీలు తమ తమ బూత్ లపై దృష్టి సారించాలన్నారు. ఎన్నికలలో అనుసరించాల్సిన కార్యాచరణ పై నాయకులు ,కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బూత్ లెవెల్ ఓటింగ్ పై ఇంఛార్జీలకు పలు సూచనలిచ్చారు. ఎన్నికలయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎండల కారణంగా ఉదయం వేళల్లోనే దాదాపు ఎక్కువ పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేత పరిచి ప్రతీ బూత్ నుండి మంచి మెజార్టీ సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు , నియోజకవర్గంలోని అన్ని బూత్ ల ఇంఛార్జీలు పాల్గొన్నారు.