సిరాన్యూస్, ఓదెల
గూడెంలో జాతీయ పౌర హక్కుల దినోత్సవం
ఓదెల మండలంలోని గూడెం గ్రామంలోని దళిత కాలనీలో మంగళవారం జాతీయ పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓదెల తహసీల్దార్ యాకన్న మాట్లాడుతూ జాతి కులం మతం గాని వివక్షత లేకుండా అందరూ సమానులే అనే ఆలోచన అందరికీ కలగాలని తెలిపారు.కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి, ఓదెల పశు వైద్య అధికారి కుమారస్వామి, గిర్ధవర్ నర్సింగం , పోత్కా పల్లి ఏఎస్ ఐ, పంచాయతీ కార్యదర్శి , దళిత నాయకులు సభ్యులు పాల్గొన్నారు.