సిరాన్యూస్, సైదాపూర్
కవులు, రచయితలపై ఏబీవీపీ దాడి హేయమైన చర్య
* వామపక్ష విద్యార్థి, యువజన సంఘం ఎఐఎస్ఎఫ్ ,ఎఐవైఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు లంకదాసరి కళ్యాణ్
కాకతీయ విశ్వవిద్యాలయంలో సెక్యూలర్ రైటర్స్ ఫోరం (సముహా) ఆధ్వర్యంలో కవులు, రచయితలు నిర్వహించిన రాష్ట్ర సదస్సును మతోన్మాద ఏబీవీపీ మూకలు అడ్డుకోవడం అప్రజాస్వామికం అని వామపక్ష విద్యార్థి, యువజన సంఘం ఎఐఎస్ఎఫ్ , ఎఐవైఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు లంకదాసరి కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాటా్లడారు. కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీతలైన పసునూరి రవీందర్, మెర్సీ మార్గరేట్ మరియు ప్రొ. కాత్యాయిని విద్మహే ,రచయితలు నరేష్ కుమార్ సూఫీ, స్కైబాబ,భూపతి వెంకటేశ్వర్లు లను అసభ్య పదజాలంతో దూషిస్తూ వారి పై దాడి చేసిన ఎబివిపి మూకలను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా వర్సిటీ అనుమతులు తీసుకొని కాకతీయ యూనివర్సిటీలో సభను నిర్వహిస్తుండగా యూనివర్సిటీకి సంబంధంలేని వ్యక్తులు ,ఎబివిపి మూకలు సభ జరుగుతున్న హాల్ లోకి చొరబడి మైక్ విసిరేసి, బ్యానర్ చింపి గందరగోళం సృష్టించారన్నారు. పోలీసుల ఎదుటే సమూహ రాష్ట్ర కో కన్వీనర్ నరేష్ కుమార్ సూఫీ పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. కవులు రచయితలు, మేధావుల పై వరుస మూక దాడులు చేయడం పారిపాటుగా మారిందని, గతంలో కూడా ఇదే యూనివర్సిటీలో పోలీసు వాహనంలో ఉన్న బైరి నరేష్ పై ఇలాంటి వారు దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయనీ తెలిపారు. తక్షణమే దాడి చేసిన వారిని శిక్షించాలనీ, యూనివర్సిటీలలో అకడమిక్ వాతావరణాన్ని కాపాడాలని ఉన్నత అధికారులను కోరారు.