సిరా న్యూస్, సైదాపూర్
బీజేపీ హయాంలోనే దేశం అభివృద్ధి :బీజేపీ నాయకులు బండ శివనందా రెడ్డి
బీజేపీ హయాంలోనే దేశం అభివృద్ధి జరిగిందని, ప్రజలంతా గమనిస్తున్నారని బీజేపీ నాయకులు బండ శివానంద రెడ్డి అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ సమగ్రత, భద్రత కోసం మోడీని మళ్లీ గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అగ్రనేతలు తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు అబద్ధాలు చెప్పించి ఏ ఒక్క దాన్ని నిజం చేయకుండా అబద్దాలతో కాలం గడుపుతున్నారని అన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయకుండా అప్పులు ఉన్నాయని దాట వేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు బీజేపీ కి ఓటు వేసి బండి సంజయ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అయన కోరారు.