Vijayaraman Rao: గడ్డం వంశీ కృష్ణను భారీ మెజారిటీతో గెలిపిద్దాం : ఎమ్మెల్యే విజయరమణ రావు

సిరా న్యూస్, ఓదెల
గడ్డం వంశీ కృష్ణను భారీ మెజారిటీతో గెలిపిద్దాం : ఎమ్మెల్యే విజయరమణ రావు
*  రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తాం

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను భారీ మెజారిటీతో గెలిపిద్దామ‌ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ఓదెల మండల కేంద్రంలోని జగదంబ సెంటర్ వద్ద మంగళవారం రాత్రి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ‌ తో కలిసి కార్నర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈస‌మావేశానికి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు హాజ‌రై మాట్లాడారు. ఎన్నికల ముందు రైతులు పండించిన వరి ధాన్యం గింజ తరుగు లేకుండా కొనిపిస్తానని మాట ఇచ్చి ప్రస్తుతం ఆ మాట నిలబెట్టుకున్నానని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన వరి ధాన్యం ను బస్తాకు నాలుగు నుంచి ఐదు కిలోలు తరుగు పేర దోపిడి చేశారని ఆరోపించారు.ప్రస్తుతం రైతులు పండించిన వరి ధాన్యము నుంచి గింజ కటింగ్ లేకుండా ఐకెపి గానీ, సింగిల్ విండో సొసైటీలో కానీ ధాన్యం కొనడం జరుగుతుంద‌న్నారు. ఇసుక కూడా ఎలాంటి దోపిడీ జరగకుండా ట్రాక్టర్ల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. వరి ధాన్యం కొన్న వెంటనే ట్రక్ సీట్ రైతుకిచ్చి కేవలం మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఎస్సారెస్పీలో సరిగా నీరు లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి ఎస్ ఆర్ ఎస్ పి డి86, డి83 కాలువల ద్వారా సాగునీరు అందించి రైతుల పంటలను కాపాడడం జరిగింది అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ కట్టి హుస్సేన్ మియా వాగు పరివాహక ప్రాంత రైతులకు రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందిస్తానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల విద్యుత్ మాఫీ, 500 కే గ్యాస్ సిలిండర్ తో పాటు వచ్చే పంద్రాగస్టు లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంద‌న్నారు. వచ్చే వానకాలం పంట నుంచే 500 రూపాయలు రైతులకు బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కేంద్రంలో రాహుల్ ప్రధానమంత్రి చేస్తే ఐదు పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. స్వామినాథన్ కమిటీ ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర, ఉపాధి హామీ కూలీలకు రూపాయలు 400 , ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళకు లక్ష రూపాయలు, సంవత్సరముకు 30 లక్షల ఉద్యోగాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇండ్లు లేని వారందరికీ జూన్ 15 నుంచి ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు ఇన్‌చార్జీ మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, పెద్దపల్లి అసెంబ్లీ కో ఆర్డినేటర్ రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి. ఓదెల ఎంపిటిసి బోడకుంట లక్ష్మి చిన్నస్వామి . చీకట్ల మొండయ్య అల్లం సతీష్ బండారి కుమారస్వామి, పర్శ రమేష్, క్యాతం వెంకటేశ్వర్లు, ఇందుర్తి శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి చింతం స్వామి . గోపు నారాయణరెడ్డి, ఢిల్లీ శంకర్, వీర వేణి శంకర్, అంబాల కొమురయ్య, చొప్పరి రాజయ్య, బైరి రవికుమార్ , అంకం రమేష్ .జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఎస్.యూ.ఐ నాయకులు, సింగిల్ విండో డైరెక్టర్లు, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *