భూమి హక్కు చట్టంపై దాడి స్పందన

సిరా న్యూస్,అనకాపల్లి;
భూమి హక్కు విధివిధానాలపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. భూ యాజమాన్య హక్కు చట్టం ఫై రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ చట్టాన్ని ఆమోదిస్తూ 2023 అక్టోబర్ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 502 గా విడుదల చేసింది. ఈ చట్టంతో ప్రజలు తమ ఆస్తులపై ఉన్న హక్కును పూర్తిగా కోల్పోతారు. ప్రజల ఆస్తులను కాజేసేందుకే వైసీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇటువంటి చట్టాన్ని తీసుకువచ్చే తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ఓటమిపాలు అయింది, ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుందని అన్నారు.
=====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *