సికింద్రాబాద్ లో చరిత్రను తిరగరాస్తాం….

మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నాడు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తలసాని మాట్లాడుతూ అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వెంటే ప్రజలు ఉన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. ఆరు గ్యారెంటీ లలో 5 హామీలు అమలు చేస్తున్నాం అని ప్రకటించడం అవాస్తవం. 5 హామీలు అమలు చేస్తున్నట్లు నిరూపించాలి. అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నది… ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలి. అన్ని వర్గాల పండుగలను కేసీఆర్ ప్రభుత్వం లో ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్, రంజాన్ పండుగలను నిర్వహించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మొఖం పెట్టుకొని క్రిస్టియన్, ముస్లీం లను ఓట్లు అడుగుతారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే పద్మారావు అంటే ఒక బ్రాండ్ ఆయన గెలుపు తధ్యం… ఎవరు ఆపలేరని అన్నారు.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *