సిరా న్యూస్, కడెం
డివైడర్ను ఢీకొని యువకుడు మృతి
రోడ్డు డివైడర్ను ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన కామారెడ్డి వద్ద చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని మాసాపేట గ్రామానికి చెందిన ముంజల రాహుల్ (22) హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మంజుల రాహుల్ బుధవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో తన బైక్ పై నెం.( టీఎస్18జే8736) హైదరాబాద్ నుండి మాసాయిపేట వస్తున్నాడు. ఈ క్రమంలో సదాశివనగర్ కామారెడ్డి వద్ద డివైడర్ కు గుద్దుకొని అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందారు. యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.