Rajendra Vijay: పోలింగ్ కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ రాజేంద్ర విజయ్

సిరా న్యూస్, జైన‌థ్‌
పోలింగ్ కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ రాజేంద్ర విజయ్

ఆదిలాబాద్ జిల్లా బేల‌, జైన‌థ్ మండ‌లాల్లో బుధ‌వారం ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ రాజేంద్ర విజయ్ ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా జైనథ్లోని లక్ష్మినారాయణ ఆల‌యాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జైన‌థ్‌ లోని పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అలాగే బేలా మండలంలోనీ శంకర్గూడ చెక్ పోస్ట్ తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంత‌రం మార్కెట్ కి వెళ్లి అక్కడికి వచ్చే వివిధ ప్రాంతాల ప్రజలతో మమేక‌మ‌య్యారు. ఈసంద‌ర్భంగా వారికి ఎన్నికల గురించి ఎంత వరకు అవగాహన వుందో తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అతని వెంట జైనథ్ సీఐ డి.సాయినాథ్, బేల ఎస్.ఐ రాధిక, జైనథ్ తహసీల్దార్ శ్యామ్ సుందర్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *