స్కూళ్లకు బెదిరింపులు

సిరా న్యూస్,న్యూఢిల్లీ;

బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 50కి పైగా పాఠశాలలకు ఈ-మెయిల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపుల నేపథ్యంలో విద్యార్థులను ఇంటికి పంపించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా స్కూళ్లకు చేరుకుని పిల్లలను తీసుకెళ్లారు. ఆపై పాఠశాలల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.
షాలిమార్ గార్డెన్‌లో ఉన్న ఢిల్లీ కాన్వెంట్ స్కూల్‌కు ఈ-మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ ఉదయం 7.00 గంటలకు వచ్చింది, దీనిని పాఠశాల యాజమాన్యం ఇప్పుడు చూసి 112కి కాల్ చేసింది. పోలీసులు స్కూల్‌లో సోదాలు చేసినా బాంబు లభ్యం కాలేదు. స్కూల్ యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అటు ఢిల్లీలోని ఫైర్‌ స్టేషన్‌ 60కిపైగా కాల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్కూళ్లకు బాంబు బెదిరింపుల వెనుక ఒకే వ్యక్తి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని కనుక్కొనేందుకు పోలీసులు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఢిల్లీ డీసీపీ అపూర్వ గుప్తా మాట్లాడుతూ.. ఉదయం నుంచి చాలా స్కూళ్లకు ఈమెయిల్స్ వచ్చాయి.. స్కూళ్లను ఖాళీ చేస్తున్నారు.. ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది.. మాకు తెలిసినంత వరకు ఈ మెయిల్స్‌లోని కంటెంట్ అంతా అలాగే ఉంది అని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *