Gambheer Thakre: కరోనిలో బీఆర్ఎస్ నాయ‌కుల‌ ఇంటింటా ప్రచారం

సిరాన్యూస్, బేల‌
కరోనిలో బీఆర్ఎస్ నాయ‌కుల‌ ఇంటింటా ప్రచారం

ఆదిలాబాద్ జిల్లా బేల మండ‌లంలో క‌రోని గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ ఇంటింటా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంభీర్ ఠాక్రే మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీల‌కు ఓట్లు సీట్లు కావాలి కానీ ప్రజా సమస్యలు పట్టవు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం రూపాయలు 2500 ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరిందా అని ప్ర‌శ్నించారు. ఆదివాసి గ్రామాలలో కేసీఆర్ ప్రభుత్వమే అభివృద్ధి పనులు చేసిందన్నారు సదల్పూర్ బేల గ్రామాలలో లక్షలాది రూపాయల వ్యయంతో ఆదివాసి భవనాలు నిర్మించిన ఘనత మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న, కెసిఆర్ దే అన్నారు.ఆదివాసుల అరాధ్య దైవం కొమరం భీమ్ ఆశయ సాధనకు కెసిఆర్ ప్రభుత్వమే పని చేసిందన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు దేవన్న ఓలప్ వార్, సతీష్ పవార్, మనోజ్ గెడాం, అరుణ్ కోడాపే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *