సిరాన్యూస్, చిగురుమామిడి
ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను గెలిపించాలి: కోడలు డాక్టర్ హర్షిణి
భృఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని వారి కోడలు డాక్టర్ హర్శిని కోరారు. గురువారం చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వచించారు.ఈ 13 నెల తారీఖున కారు గుర్తుకు ఓటు వెయ్యాలని కోరారు. వారు మాట్లాడుతూ పార్లమెంట్ లో ప్రజా సమస్యల మీద ఎంత గానో పోరాటం చేశారని అన్నారు. 3400 కోట్లు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్, స్మార్ట్ సిటీ, ప్రసూతి హాస్పిటల్, వైద్యం, కొండగట్టు 300 ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి గా అనేక సేవలందించారు. ఎంపీ గా గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తారని తెలిపారు. కెసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని 48 గంటల పాటు నిలిపివేసిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఉపాధి హామీ కూలీల ఓట్లను అభ్యర్థించారు. ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు. మహిళాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీవీ మిట్టపల్లి మల్లేశం, మాజీ ఎంపీటీసీ కత్తుల రమేష్, మాజీ ఉప సర్పంచ్ పెండెల శారదా సాధనదం, దరిపెల్లి సంపత్, కత్తుల ప్రశాంత్, కొంకట వెంకటస్వామి, తాళ్ళ ప్రమీల, చట్ల సరవ్వ, గంట సారయ్య కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.