సిరా న్యూస్, కుందుర్పి
కుందుర్పిలో వైసీపీకి భారీ షాక్
ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా టీడీపీలో చేరిన 52 కుటుంబాలు
అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో వైసీపీకి ఆ పార్టీ కార్యకర్తలు భారీ షాక్ ఇచ్చారు. కుందుర్పి మండలం మాలయనూరు గ్రామానికి చెందిన 52 కుటుంబాలు గురువారం టీడీపీ పార్టీలో చేరారు. ఈసందర్భంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.