ఈ నెల 5న రాజ్ నాథ్ సింగ్ రాక

సిరా న్యూస్,జమ్మలమడుగు;
ఈనెల 5వ తేదీన వైఎస్ఆర్ జిల్లా యర్రగుంట్లలో జరిగే ఎన్నికల ప్రచార సభకు కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ వస్తున్నట్లు.. జమ్మలమడుగు అసెంబ్లీ బిజెపి అభ్యర్థి ఆదినారాయణ తెలిపారు. ఈ నెల 5 వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో ఆయన మాట్లాడతారని వెల్లడించారు. గురువారం జమ్మలమడుగు లోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్ నాథ్ సింగ్ ప్రచార సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు. వివేకా హత్య కేసులో సంబంధం ఉన్న వ్యక్తులకు ఓటు వేస్తే మన జిల్లాకు మరింత చెడ్డ పేరు వస్తుందని చెప్పారు.
=========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *