Faizullah Khan: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం : మండల అధ్యక్షుడు ఫైజుల్ల ఖాన్

సిరా న్యూస్, బేల‌
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం : మండల అధ్యక్షుడు ఫైజుల్ల ఖాన్
* ఆత్రం సుగుణను పార్ల‌మెంట్‌కు పంపిద్దాం
* మండ‌లంలో కాంగ్రెస్ నాయ‌కుల విస్తృత ప్ర‌చారం

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమ‌వుతుంద‌ని కాంగ్రెస్ బేల‌ మండల అధ్యక్షుడు ఫైజుల్ల ఖాన్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల‌ మండలంలోని చాంద్ పల్లి , మారుతి గూడా కె, గ్రామాలలో ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణక్క కు మద్దతుగా కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా గడపగడపకు వెళ్లి గ్యారంటీ కార్డులు పంచి కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివ‌రించారు. అనంత‌రం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫైజుల్ల ఖాన్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అభివృద్ధి పేరిట కేవలం కాలయాపన చేసి ప్రజలకు మోసం చేశారని ఆరోపించారు.ముఖ్యంగా ఈ రెండు పార్టీలు ఆదివాసుల యొక్క అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. ఈరోజు బిఆర్ఎస్ నాయకులు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు కాని గత ఎన్నికలు మీరు హామీ ఇచ్చి ఎంతమంది రైతుల రుణమాఫీ చేశారో ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలన్నారు. బీఆర్ ఎస్‌, బీజేపీ పార్టీల‌తో ఒరిగేదేమీ లేదన్నారు. బేల మండలం మరింత అభివృద్ధి చెందాలంటే అదిలాబాద్ ఎంపీగా ఆదివాసి బిడ్డ సుగుణక్క ను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో సీనియర్ నాయకులు విలాస్ పాటిల్, చాంద్పల్లి మాజీ సర్పంచ్ కోరంగే జంగ్ శావ్ ప్రశాంత్ రెడ్డి , కర్ను అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *